గుండ్లపల్లి స్టేజ్ వద్ద బిజెపి జెండా గద్దే ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ *సిద్ధాంతమే బీజేపీ స్ట్రెంత్… క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి…

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 06 (జాగో న్యూస్): గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ వద్ద సోమవారం రోజున బిజెపి జెండా గద్దే ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ జెండాను కేంద్రమంత్రి బండి సంజయ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న సిద్ధాంతం, భావాజాలం తో నే ఈ స్థాయికి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా అవతరించిందని , క్యాడర్ బేస్డ్ పార్టీ బిజెపి అన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు దేశాన్ని ఏలుతుందని , వరుసగా 3 సార్లు కేంద్రం లో అధికారం లో వచ్చిందని, దేశంలోనే తిరుగు లేని శక్తిగా అవతరించిందన్నారు. బీజేపీ పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదన్నారు. పార్టీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆకాంక్షించినట్టు అర్హులైన పేద వారందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అలాగే నేషన్ ఫస్ట్.,పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ నినాదం బిజెపి విధానమన్నారు. దేశ ప్రజలాంత బిజెపి పై ఎనలేని విశ్వాసం తో ఉన్నారని, అందుకే వరుసగా మూడుసార్లు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందన్నారు.,. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లడానికి కృషి చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యలపై నిరంతరం పోరాటం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కరివేద మైహిపాల్ రెడ్డి , పుల్లెల పవన్ కుమార్ ,సొల్లు అజయ్ వర్మ ,ముత్యాల జగన్ రెడ్డి ,సోమరాజు రెడ్డి ,పకిడి మహేందర్, పుల్లెల రాము, బొమ్మిడి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం బిజెపి 46వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని గన్నేరువరం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు తిప్పర్తి నికేష్ పార్టీ జెండాను ఎగరవేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్