పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టండి.

కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): ఈనెల 4వ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను అన్ని పక్కాగా చేపట్టాలని కౌంటింగ్ అబ్జర్వర్ జీ నజ్మా అధికారులను ఆదేశించారు. ఆదివారం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను అబ్జర్వర్ అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తో కలిసి పరిశీలించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంతంగా సాగేలా అన్ని జాగ్రత్తలు తీసుకో వాలని పేర్కొన్నారు. ముందే ప్లాన్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫలితాల ప్రకటనలో ఎలాంటి జాప్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు, రామ్మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్