రేకుర్తి,విద్యానగర్ లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

*అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి

కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి మెయిన్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై 17,18,19,20,39 డివిజన్ల మీదుగా కొనసాగించి విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడిప్రాధాన్యత తగ్గించే విధంగా బిజెపి ప్రవర్తిస్తుందని అదే విధంగా పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ ను అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న వారికి వ్యతిరేకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్తున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో కరీంనగర్ నియోజక వర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్, st సెల్ శ్రవణ్ నాయక్, sc సెల్ కొరివి అరుణ్ కుమార్,బాలబాద్రి శంకర్, జక్కుల మల్లేశం, బోనాల శ్రీనివాస్, ఎండీ చాంద్, బబ్లు వర్మ, నర్స గౌడ్, వరాల నర్సయ్య, అస్తపురం రమేష్, గన్ను మహేందర్ రెడ్డి, అస్తపురం తిరుమల, వెన్నం రజిత రెడ్డి, జూపాక సుదర్శన్, కాంపెల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్