నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి

కరీంనగర్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో దేశంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని ఆనాడే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పథకం కొనసాగుతుందని అన్నారు. దేశ సమైక్యత కోసం పాటు పడిన ఇందిరాగాంధీ కొన్ని దుష్ట శక్తులకు బలి కావలసి వచ్చిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులమై పని చేయాలని నరేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్,పులి ఆంజనేయులు గౌడ్,చర్ల పద్మ,ఎండి చాంద్, బొబ్బిలి విక్టర్,దండి రవీందర్,అహ్మద్ అలీ, అష్రాఫ్, వంగల విద్యా సాగర్,చింతల కిషన్, రాజిరెడ్డి, షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, బషీర్, భారీ, హసీనా,శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్