నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ 

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 03 (జాగో న్యూస్): నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గత రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ డెలివరీ, డిఫాల్ట్ మిల్లర్లు బకాయిల చెల్లింపు, వచ్చే సీజన్ కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సీజన్లకు సంబంధించి సీఎంఆర్ డెలివరీ ప్రక్రియ వేగవంతం చేసి సూచించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే సీజన్ కు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించారు. డిఫాల్ట్ మిల్లర్లు బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలని, సకాలంలో బకాయిలు చెల్లించని రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, పౌర సరఫరాల శాఖ మేనేజర్ గోపాల్ ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్