కరీంనగర్, సెప్టెంబర్ 08 (జాగో న్యూస్): తప్పులు తడకగా సర్ ఉందని తిరిగి సర్వే చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సర్లో సర్వేలో లోపాలున్నవి నోటీసుల పేరిట ఎలాంటి క్లారిటీ లేకుండా ఇస్తున్నారు అలాగే వయసు తక్కువగా తల్లితండ్రుల పేర్లు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడోచనిపోయిన వ్యక్తులకు పుట్టిన తేదీని సర్ లో ప్రచురించడం విడ్డూరమని , సర్వే నిర్వహించిన బి ఎల్ వో లు , రెవెన్యూ సిబ్బంది ఏ బేస్ మీద వ్రాసి ఇచ్చారు క్లారిటీ ఇవ్వాలని కోరారు. క్లారిటీ ఇవ్వకపోగా తిరిగి బిఎల్వోలు రెవెన్యూ సిబ్బంది వీటిని సవరించాలని ఓటర్లు కు నోటీసులు ఇస్తున్నారు. అలాంటి నోటీసులు కూడా సరైన రీతిలో ఓటర్లకు ఇవ్వడం లేదు కాబట్టి తిరిగి రీ సర్వే నిర్వహించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్ నమోదును ప్రక్రియను చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు సమన్వియంగా కోరడం జరిగింది.








