అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం. * భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. * కళ్యాణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.

కరీంనగర్ //గన్నేరువరం ఏప్రిల్ 17 (జాగో న్యూస్): శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు మండల కేంద్రం గన్నేరువరంతో పాటు పలు గ్రామాలలో అంగరంగ వైభవంగా బుధవారం జరిగాయి. మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మార్కండేయ ఆలయాలలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికి, శాలువాతో  సన్మానించారు. కాసింపేట మానసా దేవి ఆలయం, గునుకుల కొండాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, గుండ్లపల్లి సీతారాం ఆలయం, మైలారం గ్రామాలలో సీతారాముల కళ్యాణం ఆయా గ్రామాల కమిటీల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కళ్యాణ నిర్వహణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మూసుకు ఉపేందర్ రెడ్డి, కొమ్మర రవీందర్ రెడ్డి, బొడ్డు సునీల్, చిటుకూరి అనంతరెడ్డీ, మాతంగి అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, చింతల శ్రీధర్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్