కొత్తపెళ్లి మండల గౌడ సంఘం అధ్యక్షులుగా పెరుమండ్ల ఆంజనేయులు గౌడ్

కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): కొత్తపల్లి మండలం చింతకుంట ఎల్లమ్మ గుడి వద్ద సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తపెళ్లి మండల అధ్యక్షుని కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా పెరుమండ్ల ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులుగా ఆరె పరుశురాం గౌడ్, బొమ్మ తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తీగల రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కాసారపు శ్రీనివాస్ గౌడ్ పురుషోత్తం శ్రీనివాస్ గౌడ్ దుర్గం మల్లేశం గౌడ్, బుర్ర శంకర్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల కమిటీని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఈ కమిటీ పని చేయాలని రాబోయే కాలంలో గీత కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలు ప్రతి గీత కుటుంబానికి అందే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. బాధ్యతతో గీత కార్మికుల సమస్యల పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి గ్రామంలో ఈతవనం పెంచుకొనుటకై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంజాల స్వామి గౌడ్, పెరమండ్ల వేణుగోపాల్ గౌడ్ ఇతర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్