శ్రీ గాయత్రీ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం..

నాగల్ గిద్ద, మార్చి 01 (జాగోర్ న్యూస్): సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలంలోని శ్రీ గాయత్రి ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగమేశ్వర, మరియు కరస్పాండెంట్ హన్మంతు రావు పాటిల్ ,డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ హనుమంతరావు పాటిల్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీ మానవాళి మనుగడకు ఉపయోగపడాలని భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాల్ని శాసించే స్థాయికి ఎదగాలని, ఆ దిశగా ప్రతి విద్యార్థి అన్వేషణ, పరిశోధన, పరిశీలన ధోరణిని పెంపొందించుకోవాలని సూచించారు. ఆ విధంగా విద్యార్థులు ముందుకు సాగితే నూతన ఆవిష్కరణలు సాధించేందుకు దోదపడతాయన్నారు. ఆ దిశగా విద్యార్థులను తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్