కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ఇంటర్ బోర్డు అధికారులు కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కళాశాలలో తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.









