కరీంనగర్, ఫిబ్రవరి 23(జాగో న్యూస్): నాగర్ కర్నూల్ లోని కుమ్మర మల్లన్న జాతరకు వెళితే మీరు గుడి లోపటికి రావద్దు అంటూ రజక కులానికి చెందిన భార్యాభర్తలను అగ్రకుల రెడ్డి సామాజిక చెందిన నాయకులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా రెండు నెలల పసికందును కాళ్లతో తొక్కి చంపేశారు. ఈ మరణానికి కారణమైన అగ్రకుల రెడ్డి సామాజిక చెందిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి , బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్ , జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తో కలసి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గారు స్పందిస్తూ తప్పకుండా న్యాయం జరిగేలా మా వంతుగా డీజీపీ గారికి మీ యొక్క వినతి పత్రం పంపించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.









