కార్పొరేటు కళాశాలలకు కొమ్ముకాస్తున్న ఇంటర్ బోర్డు.. *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ 

కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ఇంటర్ బోర్డు అధికారులు కార్పొరేట్ కళాశాలలకు కొమ్ము కాస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ అన్నారు. ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న అడ్మిషన్లు చేపడుతున్న కార్పొరేట్ కళాశాలలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇంటర్ బోర్డ్ కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహించడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. ర్యాంకుల పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కళాశాలలో తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్