గంగమ్మ ఆలయానికి భూమి పూజ

రాజన్న సిరిసిల్ల/తంగాలపల్లి మార్చి 02 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ఆలయానికి భూమి పూజ చేసిన గ్రామస్తులు, నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోనే మండేపల్లి గ్రామం ఎంతో ప్రత్యేకత అన్నారు, ఇక్కడ ఎల్లమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు, ఈ గంగమ్మ జాతరను కూడా అలాగే జరిగేలా చూడాలన్నారు, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి కి ఈ ఆలయం గురించి దృష్టికి తీసుకువెళ్లి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవాదస్, ఎ ఎం సి వైస్ చైర్మన్ నేరళ్ల నరసింహం గౌడ్,కాంగ్రెస్ నాయకులు పూర్మాని లింగారెడ్డి,జిల్ల కాంగ్రెస్ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్,పద్మనాగర్ మాజీ సర్పంచ్ మూడరీ పోచయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్