వీవోఏల డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలి  * దీక్షకు మద్దతుగా టిఆర్ఎస్ నాయకులు 

రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల, జూన్ 01 (జాగో న్యూస్): సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కొనసాగుతున్న వీవోఏ మహిళల నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన నాయకులు, వీవోఏల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ, వీవోఏల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల రాజు మానస, వ్యవసాయ కమిటీ చైర్మన్బండి దేవదాస్, తంగళ్ళపల్లి ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, బండి జగన్, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు