సైనిక్ స్కూల్ రుక్మాపూర్‌లో 2024 జూలై 23న “ఇంటింట ఇన్నోవేషన్ అవగాహన సదస్సు”

కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): ఇంటింటా ఇనోవేటర్ 6వ ఎడిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీరామ్ శ్రీనివాస్ ఇ. మేనేజర్ మరియు డిస్ట్రిక్ట్ కో – ఆర్డినేటర్ మణిదీప్ గారు విజ్ఞప్తి చేశారు. “ఇంటింట ఇన్నోవేటర్-2024” కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు సమాజానికి, వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని, వాటిని ఉపయోగించుకోవడం ద్వారా యువత ముందుకు వెళ్లగలరని వివరించారు. సైనిక్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఆవిష్కరణలపై అవగాహన పెంపొందించడంలో సహాయపడ్డారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఖాకీ యూనిఫారంలో పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా తమ ఆలోచనల్ని, సృజనాత్మకతను వికసించడానికి కావాల్సిన ప్రేరణ పొందారు. మొత్తం కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా, విజ్ఞానపరంగా సాగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి