గత ప్రభుత్వాలను తలదన్నేలా అభివృద్ధి చేపట్టాలి. * మేయర్ ను కార్పోరేటర్లకు ఘన సన్మానం *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్

కరీంనగర్: గత ప్రభుత్వాల తలాదన్నేలా కరీంనగర్ నగరపాలక సంస్థను అభివృద్ధి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు. గురువారం నూతనంగా ఎన్నికైన కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ను , 46వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ ను , 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం.లక్ష్మి ప్రకాష్ ను వారిని శాలువా, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో నిధులు మరలించారని అన్నారు. ఈ నూతన కార్యవర్గంలో నగరపాలక సంస్థ అభివృద్ధి దిశగా కొనసాగించాలని , బీసీ సంక్షేమ సంఘం భవనానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరాము అని అన్నారు. అన్ని డివిజన్ లో గెలుపొందిన కార్పొరేటర్లు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తో పాటు తీసి సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి