16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించాలి *కేంద్రానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విజ్ఞప్తి

ఢిల్లీ, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించాలని వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని ఎంపీ డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలను పెంచే పరిస్థితులు వంటి అంశాలను ఎంపీ ప్రస్తావించారు. నియంత్రణలు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ వేదికలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొంటున్నాయని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే 16 ఏళ్ల లోపు వయస్సు గల వారికి సోషల్ మీడియా వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత