హైదరాబాద్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): హైదరాబాద్ కేంద్రంలోని బంజారాహిల్స్ లో గల తెలంగాణ ఉద్యమకారిని ఎమ్మెల్సీ విజయశాంతి గారి నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రిజిస్టర్ అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం చేసి వారికి అభినందనలు తెలవడం జరిగింది ఈ సందర్భంగా ఓరుగంటి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కులు తొందరగా నెరవేరాలని అనేక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల యొక్క కుటుంబాలను మేలు కోరుతూ మహా చండి యాగం కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కులు అమలు కావాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని సంకల్పించి కరీంనగర్ నుండి వేములవాడకు 1200 మంది ఉద్యమకారులతో విజయ సంకల్ప యాత్ర చేయడం జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు అనే అటువంటి సంకల్పంతో కరీంనగర్లో భూ పోరాట కార్యక్రమం చేయడం జరిగింది . దాని వలన రాష్ట్రంలో ఉద్యమకారుల యొక్క లక్ష్యం రాష్ట్ర చెప్పగలిగ రిలే నిరాహార దీక్షలు ఎమ్మెల్యేలు మంత్రులకు అనేకసార్లు వినతి పత్రాలు కలెక్టర్లకు ఎమ్మార్వో వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యమకారులకు కావలసినటువంటి రావలసినటువంటి హక్కుల గురించి అనేకమార్లు దరఖాస్తు రూపంలో వినతుల రూపంలో నిరసన రూపంలో తెలియజేయడం జరిగింది అని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ఎటువంటి కష్టం వచ్చినా తప్పకుండా నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఉద్యమకారులకు న్యాయం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనిగ విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి మహిళా అధ్యక్షురాలు జానకి రెడ్డి, కనకం కుమారస్వామి, ఆడాల యాదన్న, మాధవి, దేవేంద్ర రెడ్డి, కవిత కరెంగుల నరేందర్ గౌడ్, ఆకోజి సరిత జగ్గయ్య తదితరులు పాల్గొన్నరు









