కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): పోషణ్ పక్షోత్సవాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో పోషణ్ పక్షం కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అధికారులు అందరూ కలిసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. చిన్నారులను ఫిజికల్ ఆక్టివిటీలో పార్టిసిపేట్ చేయించాలన్నారు. చిన్నారులకు హెల్త్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ సమయానికి అందించాలన్నారు. వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. ఈనెల తొమ్మిది నుంచి ప్రారంభమైన పోషణ్ పక్షం కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి డి ఐ ఓ సాజిదా సిడిపివోలు డిఆర్డిఏ మెప్మా విద్య హెల్త్ శాఖ అధికారులు పాల్గొన్నారు.








